adi saikumar: ఆసక్తిని రేపుతోన్న 'నెక్స్ట్ నువ్వే' ట్రైలర్!

  • హారర్ కామెడీ సినిమాలో ఆది సాయికుమార్
  •  దర్శకుడిగా పరిచయమవుతోన్న బుల్లితెర ప్రభాకర్
  •  ప్రత్యేకమైన పాత్రలో రష్మీ 
  • నవంబర్ 3న విడుదల  

ఆది సాయికుమార్ కథానాయకుడిగా బుల్లితెర ప్రభాకర్ ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆది సాయికుమార్ .. వైభవి జంటగా నటించిన ఈ సినిమాలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది.

తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=_0jCUnU_HgE

More Telugu News