ntr: రాశిఖన్నాతో పాటేసుకుంటోన్న ఎన్టీఆర్ !

ఎన్టీఆర్ .. బాబీ కాంబినేషన్లో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ .. రాశి ఖన్నాలపై ఒక డ్యూయెట్ ను తెరకెక్కిస్తున్నారు.

సంగీత సాహిత్యాల పరంగానే కాకుండా, చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా నుంచి 'లవ' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఆ పాత్రకి చెందిన టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులకు ఇస్తోన్న కానుక ఇదే. 

More Telugu News