: మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్న టీమిండియా... నేటి మధ్యాహ్నం 2:30కి మ్యాచ్ షురూ!

నేటి మధ్యాహ్నం శ్రీలంకతో టీమిండియా రెండో వన్డే ఆడనుంది. పల్లెకెల వేదికగా జరగనున్న ఈ వన్డేలో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా ఈ వన్డేను కూడా గెలుచుకుని ఆధిక్యం సంపాదించాలన్న ఉద్దేశంతో ఉంది. ఇప్పటికే టెస్టు సిరిస్ లో ఘోరపరాజయంతో అభిమానుల ఆగ్రహానికి గురైన శ్రీలంక జట్టు మాత్రం ఎలాగైనా ఈ వన్డేలో విజయం సాధించి, అభిమానులను సంతోష పెట్టాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రెండో వన్డే హోరాహోరీ జరుగుతుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేటి మ్యాచ్ 2:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండడం క్రీడాభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. 

More Telugu News