ajith: 'వివేకం' హిట్ తో కాజల్ ముచ్చట తీరేనా?

చాలా కాలంగా అగ్రకథానాయికగా కొనసాగుతూ వచ్చిన కాజల్ కి ఆ మధ్య వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దాంతో ఆమె పనైపోయిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి చిరంజీవి 150వ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి .. అందరి దృష్టిని కాజల్ వైపుకు మళ్లించింది. దాంతో ఆమెకు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో ఛాన్స్ దక్కింది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా .. భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన 'వివేకం' విడుదలవుతోంది. అజిత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఫస్టు లుక్ నుంచే భారీగా అంచనాలను పెంచుతూ వస్తోంది. హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ముచ్చట పడుతోన్న కాజల్, ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందనే నమ్మకంతో వుంది. 'వివేకం' ట్రైలర్ చూసిన వాళ్లు .. ఆమె ముచ్చట తీరడం ఖాయమని చెప్పుకుంటున్నారు .     

More Telugu News