: నవాజ్ షరీఫ్ ను వెంటాడుతున్న కష్టాలు!

అవినీతి ఆరోపణలతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన భార్య కుల్సుమ్ నవాజ్ కు గొంతు సంబంధిత క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కుల్సుమ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఆమెకు అక్కడే శస్త్ర చికిత్సను నిర్వహిస్తారని సమాచారం. కుల్సుమ్ కు వచ్చిన క్యాన్సర్ ఇంకా తొలి దశలోనే ఉందని... దీంతో, ఆమెకు క్యాన్సర్ నయం చేసే అవకాశం ఉందని పాక్ మీడియా తెలిపింది. మరోవైపు, షరీఫ్ పై అనర్హత వేటు పడటంతో... ఆయన స్థానంలో పోటీ చేసేందుకు కుల్సుమ్ నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో ఈ ఉప ఎన్నిక జరగనుంది.

More Telugu News