: భార‌త్ వ‌చ్చిన ప్రియాంక చోప్రా... క‌థ‌ల‌తో సిద్ధంగా ఉన్న 25 మంది ద‌ర్శ‌కులు!

సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించే `గుస్తాక్‌` చిత్రంలో క‌థానాయ‌కుడిని ఎంపిక సందర్భంగా 2 వారాల పాటు భార‌త్ కు వ‌చ్చిన ప్రియాంక చోప్రాకు క‌థ‌లు చెప్ప‌డానికి దాదాపు 25 మంది ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో `పింక్‌` ద‌ర్శ‌కుడు అనిరుద్ధ రాయ్ చౌద‌రి, `చ‌క్ దే ఇండియా` ద‌ర్శ‌కుడు శిమిత్ అమిన్‌, క‌బీర్ ఖాన్‌, అలీ అబ్బాస్ జాఫ‌ర్‌, విశాల్ భ‌ర‌ద్వాజ్‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే క‌ర‌ణ్ జొహార్ `ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌` వారు కూడా ప్రియాంక కోసం ఓ క‌థ‌ను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.

వీటిలో క‌నీసం మూడు స్క్రిప్టుల‌కైనా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే యోచ‌న‌లో ప్రియాంక ఉన్న‌ట్లు ఆమె స‌న్నిహిత వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. అంతేకాకుండా త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ `ప‌ర్పుల్ పెబ్బ‌ల్ పిక్చ‌ర్స్‌` ద్వారా నిర్మించిన `ప‌హునా` సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా ప్రియాంక పాల్గొన‌నుంది. ఇప్ప‌టికే హాలీవుడ్ `క్వాంటికో` టీవీ సిరీస్ మూడో సీజ‌న్‌తో పాటు `ఈజింట్ ఇట్ రొమాంటిక్‌`, `ఎ కిడ్ లైక్ జేక్‌` చిత్రాల్లో ప్రియాంక న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు మాధురీ దీక్షిత్ జీవిత క‌థ ఆధారంగా ఇంగ్లీషులో నిర్మిస్తున్న టీవీ సిరీస్‌కి కూడా ప్రియాంక స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

More Telugu News