: ఒక్క రోజులోనే 9500 ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేయనున్న మోదీ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఒక్క రోజులోనే ఆయన ఏకంగా 9500 రోడ్డు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికకానుంది. ఈ రోడ్లలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు ఉన్నాయి. ఈ రోడ్డు ప్రాజెక్టును రూ. 27వేల కోట్లతో చేపట్టారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించనుండగా, మిగిలిన వాటికి శంకుస్థాపన చేయనున్నారు.

 873 కి.మీ. మేరకు నిర్మించిన 11 జాతీయ రహదారులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ భారీ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు హాజరుకానున్నారు. మరోవైపు, వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ భారీ రోడ్ల ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News