: తిరుమల గిరులు ఖాళీ... కేవలం 2 కంపార్టుమెంట్లలోనే భక్తులు

గడచిన వారం పది రోజులుగా కిటకిటలాడిన తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. భక్తులతో కిక్కిరిసిన తిరుమల వీధులు బోసిపోయాయి. ఈ ఉదయం సర్వదర్శనం నిమిత్తం కేవలం 2 కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్న పరిస్థితి కనిపించింది. వీరికి ఉదయం 11 గంటల్లోగానే దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. రద్దీ గణనీయంగా తగ్గడంతో, కాలినడక భక్తులకు 2 గంటలలోపు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు గంటన్నరలోపు దర్శనం పూర్తవుతోంది. ఇక భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల కొండపై నివాసముండే వారు స్వామివారి దర్శనానికి వెళుతున్నారు. తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించే బస్సుల సంఖ్యను కూడా అధికారులు తగ్గించారు. 

More Telugu News