dhanush: 'విఐపి 2' సినిమా విషయంలో సౌందర్యపై విమర్శలు!

ధనుష్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'విఐపి' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరును .. ఆ పాత్ర యూత్ ను ప్రభావితం చేసిన తీరును ప్రేక్షకులు అభినందించారు. ఇక ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ ఎంతటివారినైనా కదిలించి వేస్తుంది. ఈ కారణంగానే ఈ సినిమా తెలుగు వెర్షన్ 'రఘువరన్ బీటెక్' కూడా హిట్ కొట్టింది.

 ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'విఐపి 2' మాత్రం ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి ధనుష్ అందించిన కథ బాగానే ఉందనీ, అయితే, తన దర్శకత్వంతో సౌందర్య ఆ కథను ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి వస్తోన్న తక్కువ రేటింగ్స్ కి సౌందర్యనే కారకురాలని చెబుతున్నారు. ఆమె వల్లనే ధనుష్ హిట్ ను మిస్సయ్యాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.        

More Telugu News