: ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ని చించేసిన వీహెచ్ ను ‘తాతయ్యా..’ అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్!

ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) దానిని చింపివేయడంపై ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. తన ట్విట్టర్ వేదికగా ‘తాతయ్యా, చిల్’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. కాగా, నాంపల్లిలోని గాంధీభవన్ లో నిన్న జరిగిన ఓ సమావేశానికి హాజరైన వీహెచ్ తిరిగి వెళుతుండగా, ఓ ఆర్టీసీ బస్సుపై ఈ చిత్రం పోస్టర్ ను చూశారు. దీంతో, వెంటనే ఆ బస్సును ఆపించి కండక్టర్ సాయంతో ఆ పోస్టర్ ను తొలగించి వేశారు. ఈ ఫొటో వైరల్ అయి, ఈ చిత్ర హీరో విజయ్ దేవరకొండకు చేరడంతో ఆయన స్పందించాడు. ఇదిలా ఉండగా, డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలను బస్సులపై ఉంచడాన్ని వీహెచ్ తప్పుబట్టారు.

More Telugu News