: ఈరోజు రోజా పెళ్లి రోజు.. జగన్ సమక్షంలో వేడుక!

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా పెళ్లి రోజు ఈరోజు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రోజా-సెల్వమణి దంపతులు తమ 15వ వివాహ వార్షికోత్సవం వేడుకను నంద్యాలలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కాగా, రోజా దంపతులు ఈ వేడుకను వైసీపీ అధినేత జగన్ సమక్షంలో జరుపుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా రోజా దంపతులను జగన్ అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News