balakrishna: 'పైసా వసూల్' పై ఫిల్మ్ నగర్ టాక్!

దర్శకుడిగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడమెలాగో పూరీ జగన్నాథ్ కి బాగా తెలుసు. ఇక హీరోగా మాస్ ఆడియన్స్ ను మెప్పించడంలో బాలకృష్ణ సిద్ధహస్తుడు. ఈ నేపథ్యంలోనే 'పైసా వసూల్' ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులకి ఇందులో మాస్ ఆడియన్స్  కోరుకునే కంటెంటే ఎక్కువగా ఉందనే విషయం అర్థమైపోయింది.

 దాంతో యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఈ సినిమా ఎంతవరకూ థియేటర్స్ కి రప్పించగలదనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజుల్లో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉంటేనే వసూళ్ల విషయంలో దూసుకెళ్లడం జరుగుతోంది. ఏదో ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే రాబడి తగ్గుతోంది. ఇప్పటికే 'శాతకర్ణి' సినిమాతో బాలకృష్ణ 50 కోట్ల క్లబ్ లోకి చేరాడు. మరి ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఆయనని నిలబడుతుందా? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.   

More Telugu News