bellamkonda srinivas: 'జయ జానకి నాయక' ఇంకా సేఫ్ జోన్ లోకి వెళ్లలేదట!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది . యూత్ నుంచి .. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా కోసం 35 నుంచి 40 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆ భారీతనం స్క్రీన్ పై కనిపిస్తూనే ఉంటుంది.

విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 14 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. మరో పది రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో నిలబడితేనే గాని బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లడం జరగదని అంటున్నారు. లేదంటే నష్టాలు తప్పవని చెబుతున్నారు. ప్రస్తుతానికి దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేవు కనుక, వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఎటొచ్చి ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆదరణ లేకపోవడమే పెద్ద మైనస్ గా మారింది.      

More Telugu News