manchu manoj: ఆసక్తిని రేపుతోన్న 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్

మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

 యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. నటుడిగా ఈ సినిమా తనకి మరింత పేరును తీసుకువస్తుందనీ .. తాను ఆశిస్తోన్న విజయాన్ని తెస్తుందనే నమ్మకాన్ని మనోజ్ వ్యక్తం చేశాడు.


More Telugu News