: ఫార్చ్యూన్‌-40 అత్యంత ప్ర‌భావితం చేస్తున్న యువ‌త జాబితాలో ఐదుగురు ప్ర‌వాస‌ భార‌తీయులు

వివిధ రంగాల్లో సంప్రదాయ ధోరణులను కాల‌రాసి, సరికొత్త విధానాలను ఆవిష్కరిస్తూ, ఇతరులను ప్రభావితం చేస్తున్న 40 ఏళ్ల లోపు యువతలో 40 మందిని ఎంచుకుంటూ  ఫార్చ్యూన్ మేగజైన్ జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ప్ర‌వాస భార‌తీయుల‌కు చోటు ద‌క్కింది. మూలకణ పరిశోధనలకు సంబంధించి స్టార్ట‌ప్ నెల‌కొల్పిన దివ్యా నాగ్‌కు 27వ స్థానం, ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల సాంకేతిక సంస్థ అవుట్‌క‌మ్ హెల్త్ ప‌ర్య‌వేక్ష‌కులుగా ఉన్న రిశిషా, శ్రద్ధా అగర్వాల్‌లకు 38వ స్థానం, స్వ‌చ్ఛంద సంస్థ‌ శామాసోర్స్‌ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి లీలా జానాకు 40వ స్థానం, అలాగే ఐర్లాండ్ నూత‌న ప్ర‌ధానిగా ఎన్నికైన ప్ర‌వాస భార‌తీయుడు వరద్‌కర్‌కు 5వ స్థానాలు ద‌క్కాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు అగ్రస్థానం దక్కింది.

More Telugu News