: 'ఇప్పటి వరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?' అంటూ ప్రజాప్రతినిధులను ప్రశ్నించమన్న కోదండరాం!

ప్రజా ప్రతినిధులను 'ఇప్పటి వరకు ఏం పీకారు? రేపు గెలిచాక ఏం పీకుతారు?' అని ప్రశ్నించాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘జయజశంకర్‌ సార్‌ స్ఫూర్తి- ఉద్యమ ఆకాంక్షలు - వాస్తవ పరిస్థితులు’ అన్న అంశంపై జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ప్రస్తుత ఎమ్మెల్యేలను, ‘ఇప్పటివరకు ఏం పీకారు? గెలిచాక ఏం పీకుతారు?’ అని ప్రజలు నిలదీయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి ఉంటుందని ఆనాడే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తనతో అనేవారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా లేదని, ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందుకే తెలంగాణ ఆశయ సాధన కోసమే తాము మరో పోరాటానికి సిధ్ధమవుతున్నామని ఆయన తెలిపారు. రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యపు హక్కును దేశ ప్రజలందరికీ ఇచ్చిందని, దానిని సాధించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు. 

More Telugu News