: ఎన్నికల సంఘానికి టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు

ఎన్నికల సంఘం (ఈసీ)కు టీడీపీ, వైసీపీ పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. హింసాత్మక చర్యలను వైసీపీ ప్రోత్సహిస్తోందని, పోలీసులపై దౌర్జన్యం చేసిన శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, జగన్ ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

మరోపక్క, ఓటమి భయంతో టీడీపీ ప్రలోభాలకు తెరతీసిందని, నంద్యాలలో ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగానే డబ్బులు పంచారని, టీడీపీకి ఓట్లు వేయకుంటే పథకాలు వర్తించవని బెదిరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

More Telugu News