: శ్రీలంక క్రికెటర్ల డ్రస్సింగ్ రూమ్ లో బిస్కెట్లు తినకూడదు!

శ్రీలంక క్రికెటర్ల డ్రస్సింగ్ రూమ్ లో బిస్కెట్లు తినవద్దంటూ వస్తున్న వార్తలు వాస్తవమేని జట్టు మేనేజర్ అసాంక గురుసిన్హా వెల్లడించారు. జట్టు ఫిజియో, శిక్షకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆటగాళ్లకు బిస్కెట్లు సరఫరా చేయడంపై నిషేధం విధించామని చెప్పారు. అయితే, ఈ విషయం తెలియని క్యాటరింగ్ సిబ్బంది తర్వాతి రోజు యథావిధిగా బిస్కెట్ ప్యాకెట్లను డ్రస్సింగ రూమ్ లో ఉంచారని, తాను వాటిని గుర్తించి క్యాటరింగ్ సిబ్బందికి అసలు విషయం చెప్పానని అన్నారు. ఈ విషయమై ఆటగాళ్లు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని, దీనిపై ఎటువంటి చర్చ చేయలేదని అన్నారు. కాగా, గురుసిన్హా తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు.

More Telugu News