: చంద్రబాబు కళ్లు నెత్తికెక్కాయి.. ఆయన అహంకారం ఏంటో తెలుసా?: వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు కళ్లు ఉండాల్సిన చోట లేవు, నెత్తికెక్కాయి అంటూ వైసీపీ అధినేత జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలోని మసీదు సెంటర్ లో నిర్వహిస్తున్న రోడ్ షో లో మాట్లాడుతూ, ‘కొన్నేళ్ల నుంచి చంద్రబాబు ఎంతో అవినీతి చేశారు. మట్టిని, మద్యాన్ని, ఇసుకను దేనినీ ఆయన వదిలిపెట్టలేదు. ఇరిగేషన్ వర్క్సూ వదిలిపెట్టలేదు..జెన్ కో వర్క్సూ వదిలిపెట్టలేదు. చివరకు గుడి భూములను, రాజధాని భూములను, విశాఖపట్టణం భూములనూ వదిలిపెట్టలేదు. విపరీతంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో, మన దగ్గర నుంచి దోచిన అవినీతి సొమ్ముతో ఆయన మన దగ్గరకు వస్తాడు. చంద్రబాబు గారికి అహంకారం ఏంటో తెలుసా? ఎమ్మెల్యేలను కొనేశాను, ఇక, డబ్బులు పడేస్తే ప్రజలను కూడా కొనేస్తాననే అహంకారం ఆయనకు చాలా ఎక్కువగా ఉంది’ అని ఆరోపించారు.

More Telugu News