manchu manoj: మనోజ్ చిత్రానికి తమిళనాట క్రేజ్?

మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా, సెప్టెంబర్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. శ్రీలంక ప్రభుత్వంతో పోరాడిన వేలు పిళ్లై ప్రభాకరన్ గా మనోజ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించిన మూవీ కనుక, ఇది తమిళులకు కనెక్ట్ అవుతుందని ఈ సినిమా టీమ్ భావించింది.

 అందువల్లనే 'నా తిరుంబి వరువేన్' (నేను మళ్లీ తిరిగొస్తాను) టైటిల్ తో ఈ సినిమాను అక్కడ విడుదల చేస్తున్నారు. అజయ్ నూతక్కి తెలుగువాడే అయినా .. దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నది తమిళంలోనే. అక్కడ ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులకి మంచి అభిప్రాయం వుంది. అందువలన మనోజ్ చేసిన ఈ సినిమా, తమిళ ప్రేక్షకులకి మరింత చేరువయ్యే  ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.  

More Telugu News