: జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు!

ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు లంకె పెడుతూ ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి ప్రమాదకరం ఐసిస్ అని, రాష్ట్రానికి ప్రమాదకరం జగన్ అని అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న జగన్ లో నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయం కనపడుతోందని అన్నారు. ఈ భయంతో నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ ఉపఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర అన్నారు.

More Telugu News