amy jackson: ఆరు గంటల ఫోటో షూట్ కే అమ్మడు కోటి అడిగేసిందట!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు పెద్దలు. కానీ కొంతమంది కథానాయికల వాలకం చూస్తుంటే, ఈ విషయంలో వాళ్లు చాలా ఫాస్టుగా వున్నట్టుగా అనిపించకమానదు. అలాంటి కథానాయికల జాబితాలో తాజాగా ఎమీ జాక్సన్ చేరిపోయింది. ఈ సుందరి నటించిన సినిమాల సంఖ్యను వేళ్లపై లెక్కబెట్టొచ్చు. కాకపోతే శంకర్ కాంబినేషన్లో విక్రమ్ .. రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చేయడం వలన, స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

 అలాంటి ఎమీ జాక్సన్ ను తమ ప్రోడక్ట్స్ కి ప్రచారకర్తగా తీసుకోవాలని ఒక కార్పొరేట్ సంస్థ ముందుకు వచ్చింది. ఆమెతో 3 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాళ్లు ఆమెతో ఓ 6 గంటల పాటు ఫోటో షూట్ చేయించాలనుకున్నారు. అయితే ఫోటో షూట్ కి అదనంగా ఎమీ జాక్సన్ కోటి రూపాయలు అడిగిందట. అంతే .. ఆ సంస్థ నిర్వాహకులు కోలుకోవడానికి కొంత సమయం పట్టిందట.    

More Telugu News