: తరగతి గదిలో టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు.. చావుబతుకుల్లో ఉపాధ్యాయురాలు!

బెంగళూరు మహానగర శివారు మాగడి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కర్ణాటకలో పెను కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం తరగతి గదిలోని విద్యార్థులకు సునంద (45) అనే ఉపాధ్యాయురాలు పాఠం చెబుతుండగా గుర్తుతెలియని దుండగులు తరగతి గదిలోకి చొరబడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేసి, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న సుకందకట్టె ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, ఆమెకు 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News