: అతి తక్కువ సేపు ప్రసంగం... చెప్పినట్టే చేసిన నరేంద్ర మోదీ!

ఎర్రకోటపై నా ప్రసంగాన్ని గంటలోపే ముగిస్తాను.. ఇటీవలి 'మన్ కీ బాత్' రేడియో ప్రసంగంలో మోదీ చేసిన వ్యాఖ్య ఇది. నేటి 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ మోదీ అలాగే చేశారు. జాతిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగాన్ని ముందు చెప్పినట్టుగానే గంటలోపే ముగించారు. గడచిన నాలుగేళ్లలో నరేంద్ర మోదీ, ఎర్రకోటపై ఇంత తక్కువ సేపు ప్రసంగించడం ఇదే ప్రధమం. 'మన్ కీ బాత్' ప్రసంగానికి ముందు స్వాతంత్ర్య దినోత్సవం నాడు తాను ఏం మాట్లాడాలన్న విషయమై మోదీ సలహాలు, సూచనలు కోరగా, అత్యధికులు ప్రసంగ సమయంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నాడు తన ప్రసంగాన్ని గంటలోపే ముగిస్తానని చెప్పిన ఆయన అన్నట్టే చేశారు. కాగా, 2014లో 65 నిమిషాలు ప్రసంగించిన మోదీ, 2015లో 86 నిమిషాలు, 2016లో 94 నిమిషాలు మాట్లాడారు. ఈ సంవత్సరం ఆయన కేవలం 54 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

More Telugu News