ntr: ఇక రెండు పాటలను మాత్రమే మిగిల్చిన 'జై లవ కుశ'

కల్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన రాశిఖన్నా ... నివేదా థామస్ .. నందిత నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ నుంచి కూడా ఎక్కడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగును చకచకా కానిచ్చేస్తూ వచ్చారు.

 దాంతో తాజాగా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసేసుకుంది. ఇక రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో వున్నాయి. త్వరలో వాటిని కూడా చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటలను ఫారిన్ లో చిత్రీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే 'జై' .. 'లవ' లుక్స్ బయటికి వచ్చాయి. త్వరలోనే 'కుశ' ఫస్టులుక్ ను వదలనున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.       

More Telugu News