mohan babu: మోహన్ బాబు ఆ మూవీ రీమేక్ చేయడం ఖాయమైపోయింది!

తమిళంలో హీరో ధనుష్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ 'పా పాండి' అనే సినిమాను తెరకెక్కించాడు. తమిళనాట ఈ సినిమా విజయవిహారం చేసింది. వైవిధ్యభరితమైన సినిమాగా విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను తన మిత్రుడైన మోహన్ బాబు కోసం రజనీకాంత్ అప్పట్లోనే స్పెషల్ షో వేయించారు.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ .. ప్రధాన పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రజనీ వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్త నిజం కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి మోహన్ బాబు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. 'పా పాండి' సినిమాకి ధనుష్ దగ్గర పని చేసిన సుబ్రమణ్యం శివ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి

More Telugu News