ntr: చంద్రశేఖర్ యేలేటికి ఓకే చెప్పేసిన ఎన్టీఆర్?

వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఎన్టీఆర్, వైవిధ్యభరితమైన సినిమాలు చేయాలనే నిర్ణయానికి చాలాకాలం క్రితమే వచ్చారు. ఈ కారణంగానే 'నాన్నకు ప్రేమతో' .. 'జనతా గ్యారేజ్' వంటి విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పుడు 'జై లవ కుశ' తెరకెక్కుతోంది. తాజాగా ఆయన మరో కొత్త కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇటీవల ఎన్టీఆర్ ను కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పాడట. చాలా బాగుందని చెప్పిన ఎన్టీఆర్ .. పూర్తిస్థాయి కథను సిద్ధం చేయమని అన్నాడట. ప్రస్తుతం తాను కమిటైన ప్రాజెక్టులు పూర్తి కాగానే చేద్దామని అన్నట్టు చెబుతున్నారు. 'జై లవ కుశ' తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది. ఆ తరువాత ఆయన కొరటాలతో సెట్స్ పైకి వెళతాడా? .. చంద్రశేఖర్ యేలేటి ప్రాజెక్టు చేస్తాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.   

ntr

More Telugu News