: ఏపీలో బహుమతులు గెలుచుకున్న శకటాలివి!

తిరుపతిలో తొలిసారిగా వైభవంగా జరిగిన 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆహూతులను అలరించిన సాంస్కృతిక శకటాలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బహుమతులను అందించారు. తొలి బహుమతిని రాష్ట్ర అటవీ శాఖ లక్ష్యాలను, గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం దిశగా చేస్తున్న కార్యక్రమాలను అద్భుతంగా ప్రతిబింబించిన అటవీ శాఖ శకటానికి లభించింది. రెండో బహుమతి నీటి పారుదల శాఖకు లభించింది. పోలవరం, పట్టిసీమ కాన్సెప్ట్ ను ప్రతిబింబించేలా రూపొందించేలా తయారు చేసిన ఈ శకటం చూపరులను ఆకట్టుకుంది. మూడవ బహుమతి విద్యా శాఖ శకటానికి లభించింది.

More Telugu News