vikram: ఆడియో ఫంక్షన్ కి రెడీ అవుతోన్న 'స్కెచ్'

విక్రమ్ కథానాయకుడిగా విజయ్ చందర్ దర్శకత్వంలో 'స్కెచ్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన తమన్నా తొలిసారిగా నటిస్తోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన స్వర పరచిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

 త్వరలోనే ఆడియో వేడుకను జరపాలనే ఉద్దేశంతో వున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కోలీవుడ్ లో తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని తమన్నా భావిస్తోంది. ఈ సినిమా తరువాత 'ధ్రువ నక్షత్రం' సినిమాను పూర్తి చేసి, 'సామి 2' సినిమా కోసం హరితో కలిసి విక్రమ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 

More Telugu News