chiranjeevi: 'ఉయ్యాలవాడ' టైటిల్ లోగో రిలీజ్ ఆ రోజునే!

చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలోను కసరత్తు జరుగుతోంది. ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న లాంచ్ చేయాలనుకున్నారు. కానీ అందుకు ఇంకా రంగం సిద్ధం కాలేదు.

 దాంతో అభిమానులు నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో, ఆ రోజున 'టైటిల్ లోగో'ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే టైటిల్ లోగోను సిద్ధం చేసేశారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అందువలన ఈ సినిమాకి 'మహావీర' అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి ఏ టైటిల్ తో లోగోను రెడీ చేశారనేది చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరో రెండు నెలలు పట్టొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.   

More Telugu News