: కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ముగిశాయి!

గత వారంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకుని ఈ రోజు లాభాలను సొంతం చేసుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ 235 పాయింట్లకు పైగా లాభం సాధించి 31,449 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 9,794 పాయింట్ల వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో టాటా స్టీల్, టాటా పవర్, హిందాల్కో సిప్లా, సన్ ఫార్మా సంస్థల షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, బోష్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం సంస్థల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. కాగా, అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం, డొల్ల కంపెనీలపై చర్యలు చేప్టటేందుకు సెబీ తీసుకున్న నిర్ణయం మొదలైన కారణాలతో గత వారంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

More Telugu News