charan: 'రంగస్థలం' కోసం నదీ తీరం సెట్!

హాలీవుడ్ సినిమాల్లో నదికి సంబంధించిన .. సముద్రానికి సంబంధించిన సన్నివేశాలను స్టూడియోలోనే సెట్లో తీసేసి నిజమైన అనుభూతిని కలిగిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తెలుగులో అలాంటి ప్రయోగం చేయాలంటే అది కొంత సాహసంతో కూడుకున్న పనేనని చెప్పాలి. అలాంటి సాహసమే సుకుమార్ చేయనున్నట్టు తెలుస్తోంది.

 'రంగస్థలం 1985' సినిమా కోసం, గోదావరి .. సముద్రంలో కలిసే తీరంలోని ఒక పల్లెకి వెళ్లి అక్కడ సుకుమార్ కొంతభాగం చిత్రీకరణం జరిపారు. ఇక అక్కడ చిత్రీకరణకు అనుకూలంగా లేని సన్నివేశాల కోసం ఆయన హైదరాబాద్ లో సెట్ వేయిస్తున్నారు. 5 కోట్ల ఖర్చుతో నదీ తీరంలోని పల్లెటూరు సెట్ వేయిస్తున్నాడట. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా 'నది'ని సృష్టించనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి దగ్గరగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండేలా చూసుకుంటున్నారట. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.    

More Telugu News