: రానా గురించి రాంగోపాల్ వర్మకు మెసేజ్ పెట్టిన యువతి!

దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'పై ప్రశంసలు కురిపిస్తున్న వారి జాబితాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా చేరిపోయాడు. తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ, "రెండు తెలుగు రాష్ట్రాలూ ఇప్పుడు రానా గురించే మాట్లాడుకుంటున్నాయి. ఈ చిత్రంతో పాటే విడుదలైన మిగతా రెండు సినిమాల్లోని హీరోల గురించి అందరూ మరచిపోయినట్లుంది. 'బాహుబలి'లో రానా పర్సనాలిటీ గురించి మాట్లాడుకున్నారు. కానీ, 'నేనే రాజు నేనే మంత్రి'లో అతని నటనాకౌశలం గురించి చర్చించుకుంటున్నారు. ఓ గ్రీకు దేవుడి అందం, సూపర్ డూపర్ నటనను మించిన కాంబినేషన్ ఏముంటుంది? నాకో అమ్మాయి మెసేజ్ పెట్టింది. 'నేనే రాజు నేనే మంత్రి'లో రానా 'లై', 'జై...'లకన్నా అద్భుతమని, అతను మ్యాజిక్ చేశాడని చెప్పింది" అని రాంగోపాల్ వర్మ చెప్పాడు.

More Telugu News