: తాము సురక్షితంగా ఉండే దేశానికి ముస్లింలు నిరభ్యంతరంగా వెళ్లవచ్చు: మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వ్యాఖ్య‌ల‌పై ఆర్ఎస్ఎస్

తాము సురక్షితంగా ఉండే దేశానికి ముస్లింలు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఇటీవ‌లే ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన హ‌మీద్ అన్సారీ.. భార‌త్‌లో ముస్లింలు అభ‌ద్ర‌తా భావంతో ఉన్నార‌ని సంచ‌‌లన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఆయ‌న‌ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఇంద్రేష్ కుమార్ నాగ్‌పూర్‌లో మాట్లాడుతూ... హ‌మీద్ అన్సారీ స్వేచ్ఛ ఉంద‌ని భావిస్తోన్న దేశానికి వెళ్ల‌వ‌చ్చ‌ని అన్నారు. హ‌మీద్ అన్సారీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని ఆయన అన్నారు. ముస్లింలు కూడా ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించారని అన్నారు. ఇన్నాళ్లూ లౌకిక వాదిగా ఉన్న హమీద్‌ అన్సారీ పదవీ విరమణ చేయగానే మ‌రో విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.   

More Telugu News