Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  'నాది నిలకడ లేని మనస్తత్వం..' అంటోంది ప్రెట్టీ డాల్ శ్రుతి హాసన్. "చిన్నప్పటి నుంచీ కూడా ఒకే చోట కుదురుగా వుండేదాన్ని కాదు. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒక భాషలో స్థిరంగా ఉండలేకపోతున్నాను. అందుకే అన్ని భాషలూ చుట్టేస్తున్నాను" అని చెప్పింది శ్రుతి నవ్వేస్తూ.      
*  బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన 'పైసా వసూల్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 17న ఖమ్మం పట్టణంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తారు. ఈ వేడుకకు బాలకృష్ణ, పూరీ జగన్నాథ్, నిర్మాత ఆనంద ప్రసాద్ తదితరులు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో వెళతారు.  
*  సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా తమిళంలో రూపొందిన 'మాయావన్' చిత్రాన్ని 'ప్రాజక్ట్ z' పేరుతో తెలుగులోకి అనువదించారు. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేస్తారు.

More Telugu News