: తెలంగాణ సచివాలయంలో నెమలి సందడి!

తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి పులకించడమే కాకుండా, సామాన్య ప్రజలు, రైతులు సేదతీరుతున్నారు. పశుపక్ష్యాదులు సైతం పరవశిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం, తెలంగాణ సచివాలయంలోకి వచ్చిన ఓ నెమలి కొంచెం సేపు సందడి చేయడమే. సచివాలయ భవనాలపై తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. 

More Telugu News