rana: తెలుగు రాష్ట్రాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' తొలిరోజు వసూళ్లు!

నిన్న ఒక్క రోజునే మూడు సినిమాలు రిలీజ్ కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ సందడి సందడిగా కనిపిస్తున్నాయి. మూడు సినిమాలు కంటెంట్ పరంగా వైవిధ్యభరితమైనవి కావడంతో, మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూడు సినిమాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 3.75 కోట్ల షేర్ ను రాబట్టినట్టు సమాచారం. ఓవర్సీస్ లోను వసూళ్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇక వరుసగా సెలవులు ఉన్నందున ఈ సినిమా వసూళ్లు భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. జోగేంద్రగా రానా పాత్రను తీర్చిదిద్దిన తీరు ..  ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు .. డైలాగ్స్ ..కాజల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని చెప్పుకుంటున్నారు.      

More Telugu News