vijay devarakonda. shalini: 'అర్జున్ రెడ్డి'కి అదృష్టం కలిసొచ్చినట్టే!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'అర్జున్ రెడ్డి' సినిమా తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా షాలిని పాండే నటించింది. ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అదే రోజున నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'యుద్ధం శరణం' మూవీని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ తేదీన రావడం లేదు.

 'యుద్ధం శరణం' మూవీని సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దాంతో 'అర్జున్ రెడ్డి'కి పోటీ లేకుండా పోయింది. సోలోగా ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సోలోగా వస్తుండం 'అర్జున్ రెడ్డికి బాగా కలిసొచ్చే అంశమనీ .. ఈ సినిమా ఆయనకి సక్సెస్ ను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.      

More Telugu News