shradda kapoor: 'సాహో' కోసం సతమతమవుతోన్న శ్రద్ధా కపూర్

'సాహో' ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తిచేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేశారు. అయితే ఇంతవరకూ మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరగలేదు. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. ఎక్కువగా శ్రద్ధా కపూర్ పేరు వినిపిస్తోంది.

 ప్రభాస్ సరసన చేయడానికి ఉత్సాహాన్ని చూపిన ఈ సుందరి, వేరే కమిట్మెంట్స్ ఉండటం వలన, డేట్స్ సర్దుబాటు చేయడానికి సతమతమైపోతుందట. డేట్స్ ఎడ్జెస్ట్ చేయగలిగితే ఆమెనే హీరోయిన్ ..లేదంటే మళ్లీ మరో హీరోయిన్ ను వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాలో ఛాన్స్ కోసం, చాలామంది కథానాయికలు కాచుకు కూర్చున్నారు. శ్రద్ధా కపూర్ ఈ ఛాన్స్ మిస్ అయితే, ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.      

More Telugu News