: ఆసుపత్రిలో అంతమంది చిన్నారుల మరణం ఓ నరమేధం లాంటిదే: నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి ఆగ్రహం
ఆక్సిజన్ అందక ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి మండిపడ్డారు. ఈ ఘటన విషాదం కాదని, ఓ నరమేధం అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆ రాష్ట్ర సీఎం తీసుకునే నిర్ణయం దశాబ్దాలుగా అవినీతిమయమైన వైద్య వ్యవస్థను సరిచేయాలని ఆయన అన్నారు. అప్పుడే ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఉంటాయని సూచించారు.