: శిల్పా మోహన్ రెడ్డికి షాక్.. టీడీపీలో చేరిన ఆయన ముఖ్య అనుచరుడు!

నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. గత 15 సంవత్సరాలుగా ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉన్న మైనార్టీ నేత కరీం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేషనల్ విద్యాసంస్థల ఛైర్మన్ గా, నంద్యాల కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, మైనార్టీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఈనెల 3వ తేదీన జరిగిన జగన్ బహిరంగసభలో శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కరీం భాయ్ లాంటి వారు తన గెలుపులో కీలకపాత్ర వహించనున్నారని కూడా చెప్పారు. అలాంటి కరీం టీడీపీలో చేరడం శిల్పాకు షాక్ అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

More Telugu News