sai pallvi: 'ఫిదా' కోసం సాయిపల్లవి మరీ అంత తక్కువ తీసుకుందా?

'ఫిదా' సినిమా సక్సెస్ సాయిపల్లవి రేంజ్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ పాత్రలో ఆమె తప్ప వేరెవరూ ఆ స్థాయిలో జీవించలేరనే టాక్ వచ్చింది. బలమైన కథా కథనాలను కలిగిన ఈ సినిమాను ఆమె అంతా తానై ముందుకు నడిపించింది. అలాంటి సాయి పల్లవికి భారీ పారితోషికమే ముట్టజెప్పి వుంటారని అనుకోవడం సహజం.

అయితే ఈ సినిమాకి గాను ఆమె అందుకున్న మొత్తం 25 లక్షలు మాత్రమేనట. ఈ సినిమా తరువాత నుంచి మాత్రం ఆమె తన పారితోషికాన్ని 70 లక్షలకి పెంచిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 'ఫిదా'లో భానుమతి పాత్ర తనకి తీసుకొచ్చిన క్రేజ్ కారణంగా, ఆ స్థాయిలో నటనకి అవకాశం వుండే పాత్రలకే సాయిపల్లవి ప్రాధాన్యతను ఇస్తోందట. మున్ముందు సాయిపల్లవి మరింతగా ప్రేక్షకులను కట్టిపడేయనుందన్న మాట.     

More Telugu News