: యూపీలో ఘోరాతిఘోరం... నిద్రిస్తున్న ముస్లిం అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గూండాలు

ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం జరిగింది. బరేలీ జిల్లా, నవాబ్ గంజ్ ప్రాంతంలో గత రాత్రి నిద్రిస్తున్న ముస్లిం అమ్మాయిలపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. నిద్రిస్తున్న అక్కా చెల్లెళ్లు గుల్షన్, ఫిజాల ఇంట్లోకి తలుపులు పగులగొట్టి చొరబడిన కొందరు గూండాలు వారిద్దరిపై పెట్రోలు పోసి, నిప్పంటించి పారిపోయారు. మంటలకు తాళలేక వారు కేకలు పెడుతుంటే, కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో 18 ఏళ్ల గుల్షన్ తీవ్రంగా గాయపడి, చావు బతుకుల మధ్య పోరాడుతుండగా, 17 ఏళ్ల ఫిజాకు 40 శాతం గాయాలు అయ్యాయి. తమను తగులబెట్టిన వారు ఎవరో తెలియదని, తమకు ఎవరితోనూ పగలు లేవని పోలీసుల విచారణలో ఫిజా పేర్కొంది. కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.

More Telugu News