Mahesh: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  మహేశ్ బాబు సినిమా ద్వారా కథానాయికగా టాలీవుడ్ లో ప్రవేశించడం అన్నది తనకు లభించిన గొప్ప అవకాశమని బాలీవుడ్ నటి, ప్రస్తుతం మహేశ్ తో 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తున్న కైరా అద్వానీ పేర్కొంది. నిన్న ముంబయ్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నది చెబుతూ, మహేశ్ తోనూ, అందులోనూ కొరటాల శివ వంటి దర్శకుడి చిత్రంలోనూ నటించే చాన్స్ రావడం నిజంగా తన అదృష్టమేనని చెప్పింది.
*  తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన 'ఆనందో బ్రహ్మ' చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ నెల 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  మార్షల్ ఆర్ట్స్ కింగ్ గా పేరు తెచ్చుకున్న బ్రూస్ లీ కథను ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెండితెరకు ఎక్కిస్తున్నాడు. ఈ అంతర్జాతీయ ప్రాజక్టుకు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తాడు.
*  ప్రముఖ తమిళ హాస్యనటుడు మొట్ట రాజేంద్రన్ ఓ తెలుగు సినిమాలో నటించనున్నాడు. నాగశౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందే తాజా చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి రాజేంద్రన్ అంగీకరించాడు.  

More Telugu News