: ప‌ట్టాల‌పై ఇరుక్కున్న వాహ‌నం... వేగంగా ఢీకొట్టిన రైలు... వీడియో చూడండి!

ప‌ట్టాల‌పై ఇరుక్కుపోయిన ఓ పెద్ద ట్రాలీ వాహ‌నాన్ని అదే ప‌ట్టాల‌పై వేగంగా వ‌స్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో ఈ ఘ‌ట‌న రికార్డ‌య్యింది. అమెరికాలోని జార్జియా ప‌ట్ట‌ణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇక్క‌డ ప‌ట్టాలు బాగోలేక‌పోవ‌డం వ‌ల్ల వాహ‌నాలు ఇరుక్కుపోతుంటాయని, కానీ కాసేప‌టికి అవి బ‌య‌ట‌ప‌డతాయ‌ని, ఇలా రైలు వ‌చ్చి ఢీకొట్టిన సంఘ‌ట‌న ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేద‌ని స్థానికులు చెబుతున్నారు. ప‌ట్టాల‌పై ఇరుక్కున్న వాహ‌నాన్ని, రైలు గుద్దిన‌పుడు ట్రాలీ మోసుకెళ్తున్న వ‌స్తువులు బ‌య‌ట‌ప‌డ‌టం వీడియోలో చూడొచ్చు.

More Telugu News