: తిరుపతి రైల్వే స్టేషన్ ముందు ఆర్టీసీ బస్సు... మహిళా కండక్టర్ పై ఆటో, టాక్సీ డ్రైవర్ల దాడి

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు చేరుకునే యాత్రికుల ప్రధాన రవాణా మార్గంగా ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భక్తులను ఎక్కించుకునేందుకు ఓ ఆర్టీసీ బస్సును ఆపగా, తమ బేరాలు పోతున్నాయని ఆరోపించిన టాక్సీ, ఆటో డ్రైవర్లు మహిళా కండక్టరుపై దాడికి దిగడం కలకలం రేపింది. ఈ ఉదయం ఆ బస్సు రైల్వే స్టేషన్ మీదుగా వెళుతూ, ప్రధాన గేటు ముందుకు వచ్చి ఆగింది. ఆ పక్కనే ఉన్న పలువురు ప్రైవేటు వాహనాల డ్రైవర్లు దాడికి దిగారు. దాడి ఘటనపై తూర్పు పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, అసలేం జరిగిందన్న విషయమై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

More Telugu News