: ఖైరతాబాద్ వినాయకుడిని వదిలి ఫిలింనగర్ కు చేరిన మహా లడ్డూ!

ప్రతి సంవత్సరమూ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ లో ఏర్పాటయ్యే భారీ వినాయకుడి చేతిలో అలంకరించబడే తాపేశ్వరం మహా లడ్డూ ఈ దఫా ఫిలింనగర్ కు వెళ్లనుంది. ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే లడ్డూ ప్రసాదం పంపిణీ, పోలీసులకు, ఉత్సవ నిర్వాహకులకు తలకు మించిన భారం కావడం, తోపులాటలు, లాఠీచార్జ్ లతో పోలీసులకు చెడ్డపేరు వస్తుండటం తదితర కారణాలతో ఈ సంవత్సరం లడ్డూ ప్రసాదాన్ని ఉంచరాదని, దాని స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన లడ్డూను స్వామి చేతిలో అలంకరిస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇక స్వామివారికి ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి స్వీట్స్‌ సంస్థ యాజమాని పోలిశెట్టి మల్లికార్జునరావు ఈ లడ్డూను అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం ఫిలింనగర్ లో ప్రతిష్ఠింపబడే వినాయకుడికి 500 కిలోల మహాలడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్టు ఆయన స్వయంగా తెలిపారు. తెలంగాణ భవన్ పక్కనే ఉన్న పూరీ జగన్నాథాలయానికి 100 కిలోల లడ్డూను ఇవ్వనున్నామని ఆయన తెలిపారు.

More Telugu News