: ఉప రాష్ట్రపతి హోదాలో ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో హమీద్ అన్సారీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
ఉప రాష్ట్రపతి పదవికి నేటితో గుడ్ బై చెబుతోన్న హమీద్ అన్సారీ తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయని ఆయన రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయమని వ్యాఖ్యానించారు. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని, తాను భారతీయుడినేనని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.