: ఒకే వేదికపై స్టాలిన్‌, క‌మ‌ల హాస‌న్, ర‌జ‌నీకాంత్

తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ముర‌సోలి ప‌త్రిక వార్షికోత్స‌వానికి ఆ పార్టీ నేత‌ స్టాలిన్‌, సినీ న‌టులు క‌మ‌ల హాస‌న్, ర‌జ‌నీకాంత్ హాజ‌ర‌య్యారు. ఆ స‌భ‌కు వెళుతున్న‌ట్లు ఎవ్వ‌రికీ చెప్ప‌ని ర‌జ‌నీ ఒక్క‌సారిగా అక్క‌డ ప్ర‌త్య‌క్షమ‌య్యారు. దీంతో తమిళ ప్రజల్లో ఈ అంశం  చర్చనీయాంశంగా మారింది. ఈ స‌మావేశంలో కమలహాసన్ వేదికపై స్టాలిన్ ప‌క్క‌న‌ కూర్చున్నారు. దీంతో క‌మ‌ల్ డీఎంకేలో చేర‌తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్, స్టాలిన్‌, క‌మ‌ల్ ఒకే చోట క‌నిపించ‌డం ఆస‌క్తికరంగా మారింది. ర‌జ‌నీ మ‌రికొన్ని రోజుల్లోనే కొత్త పార్టీ గురించి ప్ర‌క‌ట‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ ముగ్గురి క‌ల‌యిక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ రాజ‌కీయాలు ఎటువైపు ప‌య‌నిస్తాయ‌న్న ఆస‌క్తి నెల‌కొంది. 

More Telugu News