: ఈ రోజు రూ. 340 పెరిగిన బంగారం ధర!

మార్కెట్లో ఈ రోజు పసిడి ధర పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో ఈ రోజు బంగారం ధర ఒక్క‌సారి ఏకంగా రూ.340 పెరిగి, పది గ్రాముల బంగారం రూ.29,890గా న‌మోదైంది. గ‌త కొన్ని రోజుల నుంచి ప‌సిడి ధ‌ర త‌గ్గుతూ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు నాణేల త‌యారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో కిలో వెండి ధ‌ర కూడా రూ.570 పెరిగి రూ.40,070కు చేరింది. ఇక గ్లోబ‌ల్ మార్కెట్‌లో 0.09 శాతం ప‌సిడిధ‌ర ఔన్సు బంగారం ధర 1,278 డాలర్లుగా న‌మోదైంది. 

More Telugu News